అరచేతితో సూర్యుణ్ణి.. విసనకర్రతో తుఫాన్ను ఆపగలమా? 'ఖైదీ నం.150'కు ముహుర్తం ఖరారు!
హమ్మయ్య.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నెం.150" ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు తలెత్తిన ఇబ్బందులు సమసిపోయాయి. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్ ల్యాండ్ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించ
హమ్మయ్య.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నెం.150" ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు తలెత్తిన ఇబ్బందులు సమసిపోయాయి. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్ ల్యాండ్ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు.
వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. అయితే, ఈ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలకు తప్ప ఇతర ఫంక్షన్లకు దీన్ని వినియోగించుకోరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ అధికారులు పర్మిషన్ నిరాకరించారు.
దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ మండిపడ్డారు కూడా. గతంలో ఈ స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని వారు గుర్తుచేశారు. కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఈ పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపించారు. సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి చిత్రాన్ని ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు పన్నారంటూ మండిపడ్డారు. అంతేనా అరచేత్తో సూర్యుణ్ణి.. విసనకర్రతో తుఫానును ఆపడటం ఎవరితరం కాదంటూ కామెంట్స్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఈ వేడుక జరపాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో చిరు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అటు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న "ఖైదీ నెం.150" చిత్రం సంక్రాంతి రిలీజ్కి సిద్ధంగా ఉంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.