సంబంధిత వార్తలు
- మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు కలెక్ట్ చేసిన ఆదిపురుష్
- కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తున్న ఆదిపురుష్ : నిర్మాతలు
- ఆదిపురుష్ అద్భుతమైన ఫీట్తో విడుదలైంది, హనుమాన్ జీకి నివాళులర్పిస్తున్నారు
- #OneWordReview : తీవ్ర నిరాశపరిచిన #Adipurush : తరుణ్ ఆదర్శ్
- ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అలరిస్తాడా! రివ్యూ రిపోర్ట్
'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం - ఆ సంభాషణలు తొలగింపు
ప్రభాస్ - కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం విడుదలైన టాక్తో నిమిత్తం లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళుతుంది. అదేసమయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. చరిత్రని వక్రీకరించారని, పాత్రల ఔచిత్యం దెబ్బతిన్నదని, దుస్తుల ఎంపిక కూడా బాగాలేదన్న కామెంట్లు వినిపించాయి. హనుమంతుడు పలికిన కొన్ని సంభాషణలపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. వివాదాస్పదమైన సంభాషణలు తొలగిస్తామని ప్రకటించింది.
'ఆదిపురుష్' రచయిత మనోజ్ శుక్లా వివరణ ఇస్తూ 'ప్రేక్షకుల మనోభావాల్ని మేం గౌరవిస్తున్నాం.. అందుకే మా టీమ్ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొంది. కొన్ని సంభాషణలను తొలగిస్తున్నాం. ఈ సినిమా కోసం నేను నాలుగు వేల పంక్తుల సంభాషణలు రాశాను. అందులో ఐదారు సంభాషణల్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీత, హనుమాన్ల విశిష్టతని చెబుతూ ఎన్నో మంచి మాటలు, పాటలూ రాశాను. కానీ వాటితో పోలిస్తే ఈ నాలుగు మాటలే ఎక్కువ ప్రభావం చూపించాయనిపిస్తోంది. చాలా మంది నన్ను ఘోరంగా తిడుతున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోవడం లేదు అని ట్వీట్ చేశారు.
