1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:25 IST)

మోసగాళ్ళు బాగుపడలేరన్న పూనమ్ కౌర్.. ఎవరిని ఉద్దేశించి?

సినీ నటి పూమన్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మోసం చేసిన వారు ఎన్నిటికీ బాగుపడలేరంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
 
ఇంతకు పూనమ్ కౌర్ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓ సారిపరీలిద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతా నాగచైతన్య విడాకుల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌కు తెర దించేలా నాగ చైతన్య, సమంతలు ఇద్దరు కూడా ఒకే నోట్‌ను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. 
 
'చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారిలో వారు నడవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు' అంటూ అందులో పేర్కొన్నారు. అయితే వారి నిర్ణ‌యం త‌ర్వాత అభిమానులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఎంతో చూడ‌చ‌క్కగా ఉండే ఈ జంట ఇలా విడిపోవ‌డం బాధ‌ను క‌లిగిస్తుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. 
 
అయితే సామ్ విడాకులు ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికి సిద్దార్థ్ చేసిన ట్వీట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 'మోస‌గాళ్లు ఎప్ప‌టికీ బాగు ప‌డ‌లేదు. ఇది చిన్న‌ప్పుడు స్కూల్‌లో టీచ‌ర్స్ నేర్పిన పాఠం.. మీరు ఏమంటారు' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు పూనమ్ కౌర్ స్పందించింది. 
 
'అవును అది నిజమే' అని రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ చేసింది ఎవ‌రి గురించి అంటూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ డిస్క‌షన్స్ న‌డుస్తున్నాయి. కాగా, చైత‌న్య‌ని పెళ్లి చేసుకునే ముందు స‌మంత - సిద్దార్థ్‌తో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం న‌డిపిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ళు కూడా పూర్తికాకముందే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.