ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సినీ నటి పూనమ్ కౌర్ బహుమతి ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ప్రైవేట్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ సీఎం చంద్రబాబు ఓ విశిష్ట కానుక అందించారు.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమరావతి స్ఫూర్తిని ప్రతిబింభించేలా ఓ చిత్రపట ఆర్ట్ వర్క్ను ఆయనకు బహుకరించినట్టు పూనమ్ కౌర్ వెల్లడించారు. ఈ మేరకు ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.