సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (14:23 IST)

'పెద్ద' నయీమ్ పోయాడు.. కానీ 'పిల్ల' నయీమ్‌లు వేలల్లో ఉన్నారు... నట్టి భయంభయం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరణించడంతో ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆయన అనుచరులు ఇంకా బతికే వున్నారని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నట్టి కుమార్ కామెంట్స్‌తో సినీ ఇండ

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరణించడంతో ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆయన అనుచరులు ఇంకా బతికే వున్నారని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నట్టి కుమార్ కామెంట్స్‌తో సినీ ఇండస్ట్రీలో చాలామంది జడుసుకుంటున్నారు. నయీమ్ ఖాతాలో ఇప్పటికే చాలామంది సినీ పెద్దలుండగా, ఆయన మరణానికి అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే అతడి అనుచరులు మాత్రం నయీమ్‌ను అనుసరించాలని.. అతని వృత్తినే చేతబట్టాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే మాత్రం మళ్లీ నయీమ్ చేపట్టిన దుశ్చర్యలు ఉత్పన్నం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, సచిన్ జోషీ, అశోక్ కుమారులతో నయీమ్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలిసింది. వీరందరినీ నయీమ్ ఇబ్బంది పెట్టాడు. దీని గురించి అప్పటి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో చెప్పినా.. ఏమాత్రం పట్టంచుకోలేదని నట్టి కుమార్ ప్రెస్ మీట్‌లో చెప్పారు. 
 
అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం పోలీసులందరూ చుట్టాలే కావడంతో పోలీసులు ఎంత చెప్పినా పట్టించుకునే వారు కాదని నట్టి కుమార్ ఆరోపించారు. కానీ నయీమ్ మరణించడంతో సమస్య ఉండదని అనుకుంటే మాత్రం.. కష్టాలు తప్పవని.. ఆయన అనుచరులు ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ ఉన్నారని నట్టి కుమార్ తెలిపారు.