సంబంధిత వార్తలు
- ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథే యాత్ర 2 : మహి వి రాఘవ్
- వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2 నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల
- యాత్ర 2 లో ధీర వనిత వై.ఎస్.భారతిగా కేతకి నారాయణన్
- యాత్ర 2 లో సోనియా పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్
- వై.ఎస్.ఆర్గా మమ్ముట్టి; వై.ఎస్.జగన్ పాత్రలో జీవా యాత్ర 2 ఫస్ట్ లుక్
యాత్ర 2 టీజర్ రివ్యూ ఎలా వుందంటే?
Yatra 2
యాత్ర 2 చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా కనిపించబోతున్నాడు. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాత్ర 2 చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాత్ర 2 టీజర్ ఘాటుగా, ఎమోషనల్గా ఉంది.
జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను టీజర్లో వాస్తవికంగా చూపించారు. అంధుడు జగన్ కోసం వెయిట్ చేయడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. టీజర్ ప్రారంభంలోని డైలాగ్లు ఆకట్టుకున్నాయి. జగన్ను అవినీతిపరుడిగా నిరూపించేందుకు చేస్తున్న కుట్రలను టీజర్లో చూపించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు.
లక్ష కోట్లా లక్ష కోట్లు లక్షన్నర సార్లు డైలాగ్ ఆసక్తికరంగా ఉంటుంది. టీజర్ చివర్లో తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అంటూ జీవా చెప్పిన డైలాగ్ హైలైట్. టీజర్ చివర్లో మమ్ముట్టి కనిపించారు. యాత్ర 2 టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2009 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ పొలిటికల్ బయోపిక్లో నారా చంద్రబాబు నాయుడుగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ మరియు కేతకి నారాయణన్ నటించారు.
