1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (13:08 IST)

తెలుగు సాహస బాలిక హిమప్రియకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం

ఆ బాలిక చూపిన ధైర్యసాహసాలకు ఉగ్రవాది తోకముడిచాడు. ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో ధైర్యం చూపినందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల గురుగు హిమప్రియ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికైంది.
 
 
ఫిబ్రవరి 2018లో జమ్మూలోని సుంజువాన్ మిల్ క్యాంప్‌లోని ఆర్మీ జవాన్ కుమార్తె హిమప్రియ వుంటున్న నివాసంపై ఆమె తండ్రి లేని సమయంలో ఒక ఉగ్రవాది దాడి చేశాడు. గ్రెనేడ్‌ల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె దాదాపు 5 గంటలపాటు తీవ్రవాదితో హోరాహోరీ ఎదురుదాడి చేసి అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది.
 
 
ఆమె తీవ్రవాదితో ముఖాముఖి పోరాటం చేసి తద్వారా కుటుంబాలను కాపాడింది. "హిమప్రియ ధైర్యసాహసాల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, 2022ను ప్రదానం చేస్తున్నారు" అని ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది.