Astrology Yearly Horoscope Details

Notifications

మిథునం మిథునం
పరాభవ నామ సంవత్సర ఫలితాలు 2026 నుంచి 2027 వరకు ఆదాయం - 8 వ్యయం-11 రాజపూజ్యం-7 అవమానం-1 మిథునరాశి : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1, 2, 3 పాదములు ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్నింట అపజయం పొందినా మరికొన్నింట మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవహారానుకూలతలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కీలక బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. నిరంతరం శ్రమిస్తుంటారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. మీ శ్రీమతి బంధువర్గం వారితో విభేదాలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సంస్థల స్థాపనలు, గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. అవివాహితులకు వివాహయోగం. ప్రముఖులతో పరిచయాలు, సోదర వర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాల పట్ల యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. లైసెన్సులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యవసాయపరంగా అకాల వర్షాలు, వరదలు, తుఫానుల వల్ల పంటదిగుబడులు తగ్గుతాయి. మద్దతు ధర లభించటం కష్టమవుతుంది. దళారుల వల్ల మోసపోతారు. వ్యాపారపరంగా హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస, సమయపాలన ప్రధానం. పదోన్నతికి అవకాశం లేదు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ధనప్రలోభాలకు పోవద్దు. కిట్టని వ్యక్తుల వల్ల కొత్త ఇబ్బందులెదరవుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం, బాధ్యతల మార్పు. వీరి పదోన్నతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే అనుకున్న మంచి ర్యాంకులు సాధిస్తారు. సహవిద్యార్థులతో స్నేహంగా మెలిగితే మంచి ఫలితాలుంటాయి. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం లేదు. అయినప్పటికీ కోరుకున్న విద్యావకావం లభిస్తుంది. ఈ రాశివారికి ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకోగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అందరితోను కలుపుగోలుగా మెలిగి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అలక్ష్యం తగదు. వైద్యసేవలు అవసరమవుతాయి. అప్రియమైన వార్తలు వింటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. తోటి ప్రయాణీకులతో మితంగా సంభాషించండి. విదేశీ సందర్శనలకు పాస్ పోర్టు, వీసాలు మంజూరవుతాయి. కళా, క్రీడా పోటీల్లో రాణిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది.

Narendra Modi, ప్రధాని మోడీ టైంపాస్ చేసే సమయం 2 నిమిషాలే, ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లుసుదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా, ప్రస్తుతం ఉన్న వందే భారత్ చైర్ కార్ సేవలను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. విజయవాడ డివిజన్‌లో దసరా నాటికి ఈ స్లీపర్ వెర్షన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉండి, ప్రయాణికులకు విమాన ప్రయాణంతో సమానమైన అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాలను అనుసంధానిస్తున్నాయి.

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లుజూలై 28న జరగనున్న వార్షిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా అధికారులు మంగళవారం సమీక్షించారు. లుంబినీ పార్క్ నుండి సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్, గోశాల, తొలి పవంచ్ మీదుగా వెళ్లే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని తనిఖీ చేశారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఈ మార్గం పొడవునా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, వీధి దీపాలు, పార్కింగ్, కంట్రోల్ రూములు, సీసీటీవీ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, సైన్‌బోర్డులు, చెత్త సేకరణ వాహనాలు, అంబులెన్సులు, పారిశుధ్యం కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రంచదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి