1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (14:27 IST)

నదుల ద్వారా భారత్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించండి : హఫీజ్ సయీద్

సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేంతవరకు తాను నిద్రపోయేది లేదని భీష్మించిన లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌లో ఏదో విధంగా విధ్వంసం సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందిన ఉ

సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేంతవరకు తాను నిద్రపోయేది లేదని భీష్మించిన లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌లో ఏదో విధంగా విధ్వంసం సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందిన ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నాడు. వీరిని నదుల ద్వారా భారత్‌లోకి అక్రమంగా చొరబడేలా ప్లాన్ వేస్తున్నారు. 
 
దొంగదారుల్లో చొరబడటం అలవాటైన ఉగ్రవాద ముష్కరులు ఈ దఫా నదీ మార్గంలో భారతదేశంలో ప్రవేశించేలా ఆయన ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా నిక్కి తవి, బడి తవి నదుల ద్వారా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు పన్నాగాలు పన్నుతున్నాడు. ఈ ఆపరేషన్‌కు లష్కర్ కమాండర్ అబు ఇర్ఫాన్ తండేవాలాను ఇన్‌ఛార్జిగా నియమించాడని చెప్తున్నారు. భారతదేశాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ఘోరంగా, కోలుకోలేకుండా దెబ్బతీయాలన్న కసితో హఫీజ్ సయీద్ ప్రణాళికలు రచిస్తున్నాడని తెలుస్తోంది.
 
ఇందుకోసం ఇప్పటికే సుమారు 9 మందిని నియమించినట్లు, వీరికి పాకిస్థాన్ సైన్యం సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని నదులు, ప్రవాహాల వెంబడి నిఘాను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని అనుమానం వచ్చిన ప్రాంతాలపై మరింత నిఘా పెట్టారు.