దొంగిలించారనీ.. నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు... ఎక్కడ?
దుకాణం నుంచి కర్బూజ కాయలు దొంగిలించారనే కారణంతో ఇద్దరు చిన్నారులను నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు ఆ దుకాణం యజమానులు. ఈ సంఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. ఇప్పుడీ సంఘటన పెను వివాదంలా మారింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుకాణం యజమానులు ముగ్గురిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కర్బూజ కాయలను దొంగిలించారని బాషారత్ (9), ఇర్ఫాన్ (13) అనే ఇద్దరు చిన్నారులను నానా హింసలు పెట్టి వీధుల్లో బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగకుండా చిన్నారులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు కూడా గురి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో కూడా తీశారు. ఈ వీడియోనే ఆ దుకాణం యజమానుల మెడకు చుట్టుకుంది.