1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Did Chiranjeevi and Mahesh Babu miss the chance to work together in a cult classic?

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

Chiru- Mahesh babu
Chiru- Mahesh babu
సినిమాల్లో ముందుగా ఒకరిని అనుకొని తర్వాత మరో హీరోను తీసుకోవడం చాలా సార్లు జరిగిందే. పోకిరి సినిమాను పవన్ కళ్యాణ్ ను ముందుగా పూరీ జగన్నాథ్ అనుకుని సంప్రదించారు. కానీ ఆయన చేయకపోవడంతో వెంటనే మహేష్ బాబుకు దక్కింది. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను ముందుగా అనుకుంది పవన్ కళ్యాణ్ నే. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు.

దాంతో రవితేజకు అవకాశం దక్కింది. అంతకుముందు ఇడియట్ సినిమాకు అదే పరిస్థితి అప్పటికి రవితేజ పెద్దగా హీరోగా పాపులర్ కాలేదు. అందుకే ఒకరు అనుకుంటే మరొకరు లైన్ లోకి రావడం మామూలే. 
 
తాజాగా  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'ఏ మాయ చేసావే' సినిమా కోసం మొదట మహేష్ బాబును అనుకున్నాం. కానీ అందులో యాక్షన్ లేదని వదులుకున్నారు. అప్పట్లో చిరంజీవి చివరిలో అతిథి పాత్రలో కనిపించేలా ప్లాన్ చేశాం. ఈ విషయం బయటకు రాగానే  సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళ విన్నైతాండి వరువాయా రీమేక్ 'యే మాయ చేసావే' సినిమా. మాత్రుకలో శింబు, త్రిష చేశారు.
తర్వాతి కథనం
రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన