1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (09:39 IST)

బయటకు వెళ్లిన కూతురు ఇంటికి అర్ధరాత్రి వచ్చిందని... కత్తితో పొడిచిన తండ్రి

ఈశాన్య ఢిల్లీలో దారుణం జరిగింది. బయటకు వెళ్లిన కుమార్తె ఆలస్యంగా అర్థరాత్రి ఇంటికి వచ్చిందనీ ఓ తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణం ఢిల్లీలోని పాలం ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఈశాన్య ఢిల్లీలో దారుణం జరిగింది. బయటకు వెళ్లిన కుమార్తె ఆలస్యంగా అర్థరాత్రి ఇంటికి వచ్చిందనీ ఓ తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణం ఢిల్లీలోని పాలం ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పాలం ప్రాంతంలోని రాజ్‌నగర్‌కు చెందిన భవానీ శంకర్ తన 18 ఏళ్ల కూతురు బయటకు వెళ్లి అర్థరాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిందనే ఆగ్రహంతో కత్తితో పొడిచాడు. దీంతో కూతురికి మెడ, భుజంపై కత్తి గాయాలయ్యాయి. తాను మేనత్త ఇంటికి వెళ్లి తిరిగి రావడంలో రాత్రి అయిందని సదరు యువతి చెపుతోంది. 
 
గాయపడిన యువతి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి భవానీశంకర్‌పై ఐపీసీ సెక్షన్ 323, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సురేంద్రకుమార్ చెప్పారు.