సంబంధిత వార్తలు
- ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?
- శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?
- తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు
- టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం
- Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్
TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ
దర్శన టిక్కెట్లు, వసతి కోసం మధ్యవర్తుల బారిన పడవద్దని టిటిడి తన భక్తులను మరోసారి హెచ్చరించింది. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రలు అనే ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల లభ్యతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భక్తులు ఇలాంటి నకిలీ వ్యక్తులను లేదా వెబ్సైట్లను నమ్మవద్దని టిటిడి హెచ్చరించింది. అన్ని టిక్కెట్లను అధికారిక టిటిడి వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. శ్రీవారి దర్శన టిక్కెట్ల పేరుతో భక్తులను మోసం చేయడానికి ప్రయత్నించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
