శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (09:37 IST)

వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ మహిళా కమిషన్!!

Venu swami
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి, సినీ నటులు, రాజకీయ నాయకుల జాతకాలు వెల్లడించడం ద్వారా గత కొన్నాళ్లుగా బాగా పాపులర్ అయ్యాడు. అయితే, ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లలపై కామెంట్స్ చేశారు. వీరిద్దరి జాతకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
వేణు స్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, వేణు స్వామి ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. 
 
ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే, రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత, చైతన్య - శోభిత వివాహ నిశ్చితార్థంపై వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదం అయింది.