శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (19:42 IST)

కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి

CAR FIRE ACCIDENT IN GHATKESAR
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషను పరిధిలో ఘోర కారు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎరిటిగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
 
కారులో చెలరేగిన మంటల్లో మృతి చెందిన వారిలో శ్రీరామ్ అనే సైకిల్ హోల్ సేల్ షాప్ యజమానిగా గుర్తించారు. ఈ మంటల్లో మృత్యువాత పడిన యువతి వివరాలు తెలియాల్సి వుంది.