అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లను అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసులు విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబరు 13న నెల్లిమర్ల, అనకాపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషనులో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు పోలీస్ స్టేషనులో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు పోలీసులు స్టేషన్లలలో ఆమెను ఆమెను పోలీసులు వివారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుంది శ్రీరెడ్డి తెలిపారు.