1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (14:53 IST)

పాక్ నటులు భారత్‌లో ఉండొచ్చా.. అనే ప్రశ్నకు ఒకే ఆన్సర్ నో కామెంట్: హేమమాలిని

ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచ

ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు. 
 
ఈ విషయంపై సల్మాన్‌ ఖాన్‌, రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. తాజాగా బాలీవుడ్‌ నటి హేమమాలిని ఈ విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ''వివాదాస్పదమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోవడం లేదు. 
 
కానీ మొత్తంమీద.. మేము నటీనటులం. కాబట్టి పాకిస్థాన్‌ నటులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. ఓ నటిగా వాళ్ల పనిని నేను ప్రశంసిస్తాను. కానీ వాళ్లు ఇక్కడ ఉండొచ్చా? లేదా? అనే విషయం గురించి నేను కామెంట్‌ చేయదలచుకోవడం లేదు'' అని హేమమాలిని మీడియాతో అన్నారు.