విజయవాడకు చేరుకున్న గవర్నర్ నరసింహన్
ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు. ఆయన ఈ ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్కు దేవాదాయశాఖ అధికారులు, దుర్గగుడి వేద పండితులు స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆశ్వీర్వచనం పలికారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొంటున్నారు. అనంతరం ఆయన హైదరాబాదుకు పయనమవుతారు.