కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి!
రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం న్యాయస్థానంలో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. నందికొడ్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హత్య కేసులో బైరెడ్డి నిందితులుగా ఉన్నారు.
బుధవారం ఉదయం బైరెడ్డి కర్నూలు జిల్లా కోర్టులో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.