1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (13:09 IST)

చికెన్ వ్యాపారంలో గొడవ.. యువకుడిని చంపేసి పంటకాలువలో వేసేశారు

చిన్న చిన్న గొడవలు హత్యకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చికెన్ వ్యాపారంలో ఏర్పడిన గొడవతో ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిని హతమార్చి పంటకాలువ

చిన్న చిన్న గొడవలు హత్యకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చికెన్ వ్యాపారంలో ఏర్పడిన గొడవతో ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిని హతమార్చి పంటకాలువ పడేశారు. 
 
వివరాల్లోకి వెళితే కాళ్ళమండలం కోపల్లే గ్రామానికి చెందిన సాలా సురేష్‌(20) కోడి మాంసం వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సాలా వెంకన్న, సాలా రాంబాబు కూడా కోడి మాంసం వ్యాపారం చేస్తున్నారు.

వ్యాపారంలో తక్కువ ధరకు సురేష్‌ విక్రయిస్తున్నాడని గతంలో సురేష్‌తో గొడవకు దిగారు. దీంతో వివాదం ముదరడంతో సురేష్‌ను కొట్టి హత్య చేశారు. అంతటితో వదలకుండా పంటకాలువలో పడేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.