1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (12:10 IST)

కృష్ణాజిల్లా : స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం

మాసాయిపేట ఘటన చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగివస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం కృష్ణా జిల్లాలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 
 
జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద ఓ స్కూలు బస్సుకు వెనుకటైర్లు ఊడిపోయాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులున్నారు.