గతనెల మార్చ్ 29 తేదీ నుండి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నాటికి 86 లక్షల 16 వేల 639 కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.