ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతోనే ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద పట్టుబట్టకలేకపోతున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు అధికార పక్షం కూడా విపక్ష నేతపై ఆరోపణలు గుప్పించాయి.