విజయవాడ: ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పదేపదే విమర్శిస్తున్నారు. అసెంబ్లీలోనే కాదు... ఆరుబయట కూడ బహిరంగ సభల్లో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి రుజువులుంటే చూపండి అంటూ.. తెలుగుదేశం నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా,ఇపుడు వైసీపీ నేతలు ఓ అవినీతి చిట్టాను బయటపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం లక్షన్నర కోట్ల అవినీతి ఇదిగో అంటూ...ఈ లిస్టును బహిరంగంగా మీడియాకు వదిలారు.
ఇదీ లిస్టు...
1) అగ్రీ గోల్డ్ స్కాం: రూ. 9,000 కోట్లు
(ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి పుల్లారావు ఈ విషయాన్ని ఒప్పుకున్నారట)
అగ్రిగోల్డ్ భూములను మంత్రి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో కొన్నారట)
2) ఓటుకు నోటు: రూ. 50 కోట్లు
3) ఇసుక కుంభకోణం : రూ.2000 కోట్లు
4) లింగమనేని ఎస్టేట్స్కి రూ. 4 వేల కోట్ల భూపందేరం
5) నారా లోకేశ్ బినామీ దందా...
బినామీలు: వేమూరు రవికుమార్, తదితరులు
► కొనుగోలు 500 ఎకరాలు
► చెల్లించినది రూ. 50 కోట్లు
► ప్రస్తుత విలువ రూ. 650 కోట్లు
6) నారాయణ..
►కొనుగోలు 3,600 ఎకరాలు
►చెల్లించినది రూ. 432 కోట్లు
►ప్రస్తుత విలువ రూ. 14,400 కోట్లు
7) సుజనా భూదోపిడీ
బినామీలు: శ్రీ కళింగ గ్రీన్టెక్ కెమికల్స్, శివరామకృష్ణ
►కొనుగోలు 700 ఎకరాలు
►చెల్లించినది రూ. 35 కోట్లు
►ప్రస్తుత విలువ రూ. 700 కోట్లు
8) మురళీమోహన్ రియల్ భేరి
► కొనుగోలు 53 ఎకరాలు
►చెల్లించినది రూ. 16 కోట్లు
► ప్రస్తుత విలువ రూ. 212 కోట్లు
9) దళితులకు రావెల ద్రోహం
►భార్య రావెలశాంతి జ్యోతి
►కొనుగోలు 55 ఎకరాలు
►చెల్లించినది రూ. 5.5 కోట్లు
►ప్రస్తుత విలువ రూ. 82.5 కోట్లు
10) ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు’
►కొనుగోలు 196 ఎకరాలు
►చెల్లించినది రూ. 39 కోట్లు
►ప్రస్తుత విలువ రూ. 784 కోట్లు
లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెం 100039లో సర్వేనెంబర్లు 221-1బి, 219-2, 297, 286-2, 298, 356-బి, 360, 365, 366, 368-బి, 375-సి; లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఖాతానెంబరు 100126ల సర్వేనెంబర్లు 163-3, 187/బి, 226-2, 257-ఏ3, 260-ఏ, 260-బి, 260-సి, 262-ఏ, 262-బి, 358-1బి; లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్: ఖాతానెంబరు 100157లో సర్వేనెంబరు 206-1; లింగమనేని ప్రశాంతి: సర్వేనెంబర్లు 228-సి2, 229-ఏ, 229-బి, 276, 277; లింగమనేని స్వర్ణకుమారి: ఖాతానెంబరు 1488లో సర్వేనెంబర్లు 238, 239, 240-1, 240-2; లింగమనేని సుమన: ఖాతానెంబరు 1488లో సర్వేనెంబర్లు 278, 279-ఏ, 279-బి, 280, 283-1, 287-5 లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేష్ తండ్రి పూర్ణభాస్కరరావు: ఖాతానెంబరు 2372లో సర్వేనెంబర్లు 372-2ఏ, 373-ఏ... ఇవి కాకుండా వైట్సిటీ ప్రాజెక్ట్సు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్గా లింగమనేని రమేష్ పేరుతో అనేక ఎకరాల భూములు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్లు 3350, 3009, 3900, 4893, 4526, 4117, 64/79/2014, 2801, 2237, 2057,
ఖాజా గ్రామంలో సర్వే నెంబర్లు 219/2, 365, 221/18
అమరావతి మండలం ధరణికోటలో 59/ఎ2/1, 59/ఎ2/2ఎ, 59/ఎ2/2బి1, 59/ఎ2/3ఎ, 59/ఎ/2, 59/బి, 61/ఎ1, వైకుంఠపురంలో 25 సర్వే నంబర్లలో 502.31 ఎకరాలకుపైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్,
చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నంబర్లు 399-7, 402-1ఏ, 403-4, 5, 6, 404-1, 5, 6, 9బీ, 11, 12, 410-2, 412, 413, 415, 416, 417-4, 427-2, 428-1, 2, 429, 431, 432-1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ. ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మరి ఇందులో నిజాల నిగ్గు ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది.