1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (13:56 IST)

ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ పెంపు.. జగన్ సర్కారు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 14 వ తేదీ నుంచే అమలు చేయనుంది. 
 
ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో… రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది. దసరా సందర్భంగా మహా సముద్రం, ఎల్లుండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అలాగే.. పెళ్లి సందD సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
 
పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. కర్ఫ్యూ సమయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ సమయంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.