1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 మే 2021 (11:49 IST)

నిన్ను ఎస్సై పిలుస్తున్నాడంటూ తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

ఒంగోలులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఎస్సై పిలుస్తున్నాడని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
వివరాలు ఇలా వున్నాయి. ఒంగోలు కొత్తమామిడి పల్లికి సమీపంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి వెళుతుండగా ఆమెను అనుసరిస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమెని అడ్డగించి, నీ స్నేహితుడితో నువ్వు క్లోజ్‌గా వున్న ఫోటోలు నా దగ్గర వున్నాయనీ, వాటిని నీ తల్లిదండ్రులకు చూపుతానంటూ బెదిరించాడు.
 
అందుకు ఆ యువతి నేనేమీ తప్పు చేయలేదంటూ ధైర్యంగా సమాధానం చెప్పేసరికి ప్లేటు ఫిరాయించాడు. వెంటనే నిన్ను ఎస్సైగారు తీసుకుని రమ్మన్నారంటూ బెదిరించి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. ఆమెను ఊరు బయట శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆమెను మళ్లీ తిరిగి తీసుకుని వచ్చి ఆమె వుంటున్న ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాళ్లతో యువతి చెప్పడంతో వారు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.