1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Adulterated ghee for the vijayawada and srikalahasti temples

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ghee
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు (సిట్) చేస్తున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రధాన ఆలయాల్లో దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేసినట్టు సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తిరుపతిలోని డెయిరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యి పంపినట్టు విచారణాధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటివరకు తితిదేకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరి మోహన్‌ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన తమ వాదనలు వినిపించారు. 
 
ఆ సందర్భంగా ఏపీపీ ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్‌‌మైండ్ అని, బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని ఏపీపీ వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. 
తర్వాతి కథనం
ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా