రేణిగుంటలో రన్ వేపై పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు...
తిరుపతి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా రేణిగుంటకు వచ్చింది. రేణిగుంట నుంచి తిరిగి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. టైర్ పేలిపోవడంలో ప్రయాణికులను తిరుపతిలోనే ఉంచారు. ప్రయాణికులను వేరే విమానం ద్వారా హైదరాబాద్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.