1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (12:24 IST)

రాజధాని రైతులకు ఊరట... ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ నిబంధన మినహాయింపు!

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రైతులకు ఇచ్చే స్థలాల్లో నిర్మించే భవనాలకు ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ ‌(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, సీఆర్‌డీఏకి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 
 
ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామంటూ రాజధాని రైతులు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెం-168లోని నిబంధనల్నే రాజధాని అమరావతిలోనూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.