శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (11:45 IST)

ఇటు వైసీపీ ప్లీనరీ.. అటు రైతు దినోత్సవం

Farmers
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇటు వైసీపీ ప్లీనరీ.. ఇటు రైతు దినోత్సవం పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్ధాయిలో, ఆర్బీకేలలో రైతు దినోత్సవం వేడుకలు.. రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయ అనుబంధ శాఖలపై ఎగ్జిబిషన్‌ స్టాళ్ళు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రచారం చేస్తోంది. 
 
1. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌, 2. రైతు భరోసా కేంద్రాలు, 3. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, 4. ఇన్‌పుట్‌ సబ్సిడీ, 5. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, 6. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లోనే ఆయా పథకాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తోంది.
 
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాల కింద నేటి వరకు రైతులకు రూ.1,27,633.08 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో పాటు నాణ్యత పెంచేందుకు విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.
 
ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్‌ భాగస్వామ్యంతో పాలసేకరణ కేంద్రాలు, అమూల్‌ ద్వారా గతంలో కంటే అదనంగా లీటర్‌కు రూ. 5 నుండి రూ. 15 వరకు పాడిరైతులు అదనంగా అందుకుంటున్న సర్కార్ తెలిపింది.