మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (11:18 IST)

నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.5వేలు.. ట్రైనింగ్ ప్లస్ ఉద్యోగం కూడా..?

ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినట్లు తెలుస్తోదంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు భృతి

ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినట్లు తెలుస్తోదంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో వివిధ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో కంపెనీలు కూడా స్టైఫండ్‌ ఇస్తాయి. శిక్షణ పూర్తి కాగానే అదే కంపెనీలో ఉద్యోగం కూడా లభిస్తుందని ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
ఉద్యోగం నుంచి వేతనం అందిన తర్వాత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిలిపివేస్తుంది. స్థూలంగా ఇదీ ‘నిరుద్యోగ భృతి’ పథకం అమలు పద్ధతి. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి, విధానాల ఖరారుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 
తొలిసారి సమావేశమైన ఈ కమిటీ నిరుద్యోగ భృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై జూన్‌ 5న పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, నిపుణులతో సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా.. వివిధ కంపెనీల్లో ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైనా సబ్‌ కమిటీలో చర్చ జరిగింది.
 
దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను కంపెనీలలో శిక్షణ కోసం చేరుస్తామని, ఆ సమయంలో ప్రభుత్వం తరఫున నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు వారికి చెల్లిస్తామని, దీంతోపాటు కంపెనీ స్టైఫండ్‌గా రూ.3 వేలు ఇస్తుందన్నారు. శిక్షణ పూర్తవ్వగానే సదరు కంపెనీ ఆ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి పూర్తిస్థాయి జీతం ఇస్తుందని వివరించారు. ఎంతమందికి ఈ విధంగా చేయగలమనే అంశాన్ని పరిశీలించాలని సబ్‌ కమిటీలో నిర్ణయించినట్లు లోకేశ్‌ తెలిపారు.