1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Minister Pullarao Ramdan wishes to Muslims

రంజాన్ తోఫా... 5 కిలోల గోధుమలు, 2 కిలోల పంచదార... ఇంకా.. మంత్రి పుల్లారావు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుత

AP Minister Pullarao
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుతారు. ఈ నెల ప్రారంభంలోనే ముస్లీంలు పేద, నిస్సహాయులకు సేవలు, దానాలు చేయడం ప్రారంభించారని తెలిపారు. 
 
ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. అలాగే 12.5 లక్షల పేద ముస్లీంలకు 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి రూ. 17ల విలువ కలిగిన క్యారీబ్యాగ్‌ను రంజాన్ తోఫా కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
About Writer
chj
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్‌ పరువును నడిరోడ్డుపై లాగేస్తున్న జనసేన నేతలు..