1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (09:42 IST)

పెళ్ళింట విషాదం.. కొన్ని క్షణాల్లో తల్లీ కుమారుడు మృతి!!

అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ఇంట విషాదం చుట్టుముట్టింది. పెళ్లి తంతు పూర్తయిన కాసేపటికే వరుడి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మృతురాలి కుమారుడు కుప్పకూలి మరణించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈయన కుమారుడు గోవర్థన్ వివాహం శనివారం ఘనంగా నిర్వహించారు. 
 
అయితే, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ మంచానఉన్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70)ను మూడు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడడం, వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో బాధగానే వెంకటస్వామి తన కుమారుడి పెళ్లి జరిపించారు. 
 
ఈ క్రమంలో వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త వెంకటస్వామికి తెలిసింది. అది విన్నవెంటనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది.