ఎంతో ఆనందం... అంతలోనే చిన్నబోయిన చంద్రబాబు ముఖం... మోదీ వినరు... పవన్ ఆగరు...
విజయవాడ: 500, 1000 నోట్లు ఒద్దని నేను ఎప్పుడో చెప్పా... ఇప్పటికి వాటిని రద్దు చేశారని... శుభ పరిణామం అని... ఏపీ సీఎం చంద్రబాబు తన క్రెడిట్గా చెప్పుకున్నారు. కానీ, ఆ ఆనందం ఇపుడు ఆవిరైపోయింది. చంద్రబాబు చెప్పింది ఏదీ మోదీ పాటించడం లేదని అర
విజయవాడ: 500, 1000 నోట్లు ఒద్దని నేను ఎప్పుడో చెప్పా... ఇప్పటికి వాటిని రద్దు చేశారని... శుభ పరిణామం అని... ఏపీ సీఎం చంద్రబాబు తన క్రెడిట్గా చెప్పుకున్నారు. కానీ, ఆ ఆనందం ఇపుడు ఆవిరైపోయింది. చంద్రబాబు చెప్పింది ఏదీ మోదీ పాటించడం లేదని అర్ధమయిపోయింది. 500, 1000 నోట్లు రద్దు చేసిన వెంటనే ఎంతో సంతోషం అని ఉబలాటపడ్డారు. కానీ, మొత్తం రద్దు చేయలేదు... డిజైన్ మార్చారంతే... మొన్న కొత్త 1000 నోట్లతోపాటు 2000 నోట్లు కూడా తీసుకొచ్చారు. ఇపుడు తాజాగా 500 నోట్లు కూడా కొత్తవి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక చంద్రబాబు మాట ఏం విన్నట్లు?
గడచిన రెండున్నరేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే పంథా అవలంభిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ఏ విషయం ఆయనా ఆయన పెడచెవిన పెడుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని, అది ఏపీలో సెంటిమెంట్గా మారిందని, చాలా ఇబ్బందిగా ఉందని పదేపదే ప్రధానికి చెప్పారు చంద్రబాబు... ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రాధేయపడ్డారు. కానీ ప్రధాని పెడచెవిన పెట్టారు. ప్రత్యేక హోదా లేదని, ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. అది కూడా ఏమంత సంతృప్తి కరంగా లేదు... అయినా తప్పదని బాబు సర్దుకుపోయారు.
తర్వాత రాజధానికి నిధుల సమీకరణ విషయంలోనూ మోదీ సానుకూలంగా స్పందించడం లేదు. అమరావతి నిర్మాణం, రెవిన్యూ లోటు భర్తీ, పోలవరానికి నిధులు... ఇలా ఏ పనికీ కేంద్రం సహకరించడం లేదు. పైగా, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ పథకానికి నిధులు మంజూరవ్వాలన్నా, అంతకుముందు విడుదల చేసిన నిధులకు పక్కాగా లెక్కలు అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే, అంతా అయోమయపరిస్థితి నెలకొంటోంది. మరోవైపు 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు.