1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (14:46 IST)

కుప్పం రైల్వేస్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం: చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థతతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనీ, చిత్తూరు జల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం అని చంద్రబాబు అన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు కరోనా సోకగా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలం కావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బెంగుళూరు బయలుదేరాడని, ఇంతలోనే ఊపిరి అందక రైల్వే స్టేషన్‌లో చనిపోయారన్నారు.

మృతుడి సోదరుడిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయాలని అలసత్వం వీడి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.