శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (10:52 IST)

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీల నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే అంచనాల నేపధ్యంలో అప్రమత్తమైన జగన్ సర్కార్.. అర్హులైన తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఇందులోభాగంగానే గ్రామాల వారీగా జాబితాను సిద్దం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒక్క రోజు ముందుగానే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు టోకెన్లను పంపిణీ చేయాలని.. అంతేకాకుండా టోకెన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం వారిని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.