శనివారం, 12 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 ఏప్రియల్ 2025 (15:17 IST)

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

venkaiah
"ఒకే దేశం - ఒకే ఎన్నిక" పేరుతో నిర్వహించాలని భావించే జమిలి ఎన్నికలపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంలో రాజకీయ కోణం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నికపై తిరుపతిలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.
 
జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం మినహా మరేమీ లేదన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడంపై ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం ఏమాత్రం సబబు కాదన్నారు. 
 
కాగా, కేంద్రం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతోందన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఒకే దేశం - ఒకే ఎన్నికపై మేధావుల సదస్సును నిర్వహించారు.