ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (11:27 IST)

ఫేస్‌బుక్ ద్వారా ఐ లవ్ యూ.. అలా లక్ష రూపాయలు కొట్టేసింది..

సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఒకవైపు.. సైబర్ కిలేడీలు మరోవైపు.. అందిన దాకా డబ్బు గుంజుకుంటున్నారు. తాజాగా ఫేస్‌బుక్ ద్వారా ఐ లవ్ యూ చెప్పిన ఓ కిలేడీ.. హైదరాబాద్ యువకుడి నుంచి భారీగా దాచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ యువకుడికి ఓ మహిళ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొంత కాలానికి ఐ లవ్ యూ చెప్పి తన ట్రాక్‌లోకి దింపుకుంది.
 
నిజమే అనుకొని చాటింగ్ ప్రారంభించాడు హైదరాబాదీ మహమ్మద్ మొహిద్దీన్ ప్రతీరోజు ఇద్దరు చాటింగ్ చేసుకునేవాళ్లు. ఇక, ఈ నెల 17న తన ప్రేమకు గుర్తుగా గిఫ్ట్ పంపిస్తున్నానని.. అందులో ఓ ల్యాప్‌ టాప్, యూకే ఫోన్లు, కరెన్సీ, గోల్డ్, ఖరీదైన వాచ్‌... తన తొలి గిఫ్ట్ అంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టింది సైబర్ లేడీ.. కస్టమ్స్ పేరిట.. లక్ష రూపాయలు కొట్టేసింది.
 
విమానాశ్రయం నుంచి కాల్స్ చేసి.. గిప్ట్‌లకు కస్టమ్స్, ఎక్సైజ్, ఐటీ... ఇలా వివిధ పేర్లతో ఆన్ లైన్ ద్వారా లక్ష రూపాయల వరకు నొక్కేసింది.. మోసపోయానని గమనించి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.