1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 మే 2025 (19:35 IST)

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Pawan_Chandra Babu
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం విజయవాడలో ఐదువేల మందితో తిరంగ యాత్ర జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం  ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ జరుగుతుంది. 
 
ఈ యాత్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారురు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు, పురందరేశ్వరి, ఇతర నాయకులు, అధికారులు ఈ యాత్రలో పాల్గొన్నారు. సాయుధ దళాల ధైర్యం, త్యాగాలను గౌరవించేందుకు తిరంగ యాత్ర 11 రోజుల పాటు జరుగుతుంది. 
 
మరోవైపు తెలంగాణలో, ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత భారత రక్షణ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను గౌరవించడానికి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఒక గొప్ప తిరంగ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. పాల్గొన్నవారు జాతీయ జెండాను ఊపుతూ, దేశభక్తి నినాదాలు చేస్తూ జాతీయ గౌరవాన్ని ప్రదర్శించారు.