సంబంధిత వార్తలు
- టీడీపీ సానుభూతిపరుడుగా పవన్ కళ్యాణ్ : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
- ఎంత సంపాదన వచ్చినా ఎటు పోతుందో తెలియడంలేదు, ఏపీలో చాలామంది చెప్తున్న మాట... పీకల్లోతు అప్పుల్లో ఏపీ?
- మరో శ్రీలంక కానున్న ఆంధ్రప్రదేశ్ : హెచ్చరించిన 'ది ప్రింట్'
- అప్పు చేసి పప్పు బెల్లాలు పంచుతున్నాం... డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు
- ఆలయ దర్శనాల్లో వీఐపీ సంస్కృతిని పక్కనబెట్టలేం : మంత్రి కొట్టు
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భానుడి ప్రతాపంతో ఎండ వేడి నుండి ప్రజలకు ఈ వర్షం చల్లటి ఉపశమనం కలిగించింది.
తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరవకొండలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలలో చెట్లు, కటౌట్ లు నెలకొరిగాయి.
కుడేరు మండలం చోళ సముద్రం గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది భారీ శబ్దంతో పడిన పిడుగు దెబ్బకు జనం హడలిపోయారు. ఐతే ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు కానీ చెట్టు మొత్తం భారీగా మంటలు చెలరేగాయి.
తర్వాతి కథనం
