గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చిన కసాయి భర్త

ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే ఓ కసాయి భర్త కడతేర్చాడు. ఈ దారుణ హత్య గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... వట్టిచెరుకూరు సౌపాడు దళితవాడకు చెందిన మౌనిక, నూతనపాటి వెంకటేశ్వర్లుకు గ

ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే ఓ కసాయి భర్త కడతేర్చాడు. ఈ దారుణ హత్య గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... వట్టిచెరుకూరు సౌపాడు దళితవాడకు చెందిన మౌనిక, నూతనపాటి వెంకటేశ్వర్లుకు గతంలోనే రెండు సార్లు వివాహాలు జరిగాయి. వారు విడిపోయారు. చివరకు వీరు యేడాది క్రితం వివాహం చేసుకున్నారు. మొదట ఆరు నెలలు ప్రకాశం జిల్లా అమ్మడపూడిలో కాపురం పెట్టారు. వెంకటేశ్వరరావు నిరంతరం భార్యతో గొడవ పడేవాడు.
 
ఈ క్రమంలో వృద్ధులైన యువతి తల్లిదండ్రులు వారిని సౌపాడులోని తమ ఇంటికి తెచ్చుకున్నారు. వెంకటేశ్వరరావుకు ఇల్లరికం రావడం ఇష్టంలేదు. నిత్యం మద్యం సేవించి వేధించేవాడు. వివాహ సమయంలో తన ఇందిరమ్మ ఇంటిని మౌనిక పేరుతో రాశాడు.
 
దీంతో ఇంటిని చేజిక్కించుకునేందుకు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9న పెళ్లి రోజున మౌనిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంటిలో ఉన్న గొడ్డలితో ఆమె తలపై మోదీ హత్య చేసి పారిపోయాడు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్వర రావును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.