శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (13:58 IST)

భార్య టిఫిన్ వండలేదని అడిగాడు.. అంతే ఫ్యానుకు ఉరేసుకుని?

భార్యాభర్తల అనుబంధాలు రోజు రోజుకీ పెటాకులు అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఉదయం పూట అల్పాహారం వండలేదని ఏర్పడిన గొడవ ఓ వివాహిత ప్రాణాలు తీసింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కొండపల్లి మహేష్‌కు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట ప్రాంతానికి చెందిన నాగమణితో ఏడాదిన్నర కిందట వివాహమైంది. 
 
మహేష్‌ చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో దర్జీగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ 11నెలల బాబు వున్నాడు. కానీ ఆదివారం పూట ఉదయం భార్యాభర్తల మధ్య టిఫిన్ వండే విషయమై ఘర్షణ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా నాగమణి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.