శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (13:00 IST)

ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్‌లో ఎలుకల మందు కలిపి...

తల్లి అక్రమసంబంధానికి ఓ కుమార్తె సహకరించింది. దీంతో తల్లి తనకు తిరిగేలేదని రెచ్చిపోయింది. అయితే, అక్రమ సంబంధం గుట్టు ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. ఓ రోజున కట్టుకున్న భర్త కనిపెట్టాడు. దీంతో భర్తను హత్య చేసేందుకు ఆ మహిళ ప్లాన్ చేసింది. తన ప్రియుడుతో కలిసి హత్య చేసింది. తండ్రి హత్యకు కుమార్తె సైతం సహకరించడం ఇక్కడ గమనార్హం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కీసరలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిస్సాకు చెందిన బీర వసంత్‌(40) చాలా కాలం క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. బీర వసంత్ తన భార్య రేణుకతో కలిసి రాజీవ్‌గృహాకల్పలో ఉంటూ టెంట్‌హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. రేణుక గ్యాస్‌ గోదాంలో రోజూ కూలిపనికి వెళ్లేది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈ క్రమంలో రేణుకకు గ్యాస్‌ గోదాంలో తనతో పాటు పని చేస్తున్న కిషోర్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం 13 యేళ్ల కుమార్తెకు సైతం తెలిసినప్పటికీ.. ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పైగా, తల్లికి తనవంతు సహకారం అందిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయం భర్తకు కూడా తెలిసింది. దీంతో భార్యను మందలించాడు. 
 
అయితే, ప్రియుడి మోజులో పడిన రేణుక ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. ఇందుకు తన కుమార్తె (13) సహకారం కోరింది. తల్లి సూచన మేరకు ఈనెల 13వ తేదీన కుమార్తె చికెన్‌లో ఎలుకల మందు కలిపి తండ్రి వసంత్‌కు వడ్డించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వసంత్.. చికెన్ తినలేదు. ఆ తర్వాత రాత్రి మద్యం సేవించి నిద్రిస్తున్న వసంత్‌ను రేణుక తన ప్రియుడు కిషోర్, కుమార్తెతో కలిసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు. 
 
అనంతరం అతిగా మద్యం తాగినందునే చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో హత్య చేసినట్లు నిర్ధారణైంది. హత్యకు వినియోగించిన చున్నీ, టవల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రేణుక, కిషోర్‌ను రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.