1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (10:30 IST)

గుంటూరులో ఐ.టి. కలకలం... సక్కు గ్రూపు సంస్థలపై దాడులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో మాటు ఐ.టి. దాడులు క‌ల‌క‌లం రేపాయి. గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సక్కు గ్రూపు సంస్థలపై ఐటీ దాడులు ఉదయం నుండి కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
 
 
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలలో కోడి గుడ్ల వ్యాపారంలో సక్కు గ్రూప్స్ ఇటీవల కాలంలో మంచి పేరొందింది. దీనితోపాటు మిర్చి ఎగుమ‌తులు, స్పిన్నింగ్ వ్యాపారాల‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యాపార లావాదేవీల‌పై ఐ.టి. అధికారులు చెక్ పెట్టారు. ముఖ్యంగా గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ బ్రాంచ్ లో ఉదయం నుండి దాదాపు 50 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఆఫీసు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకి రానివ్వడం లేదు. వారి మొబైల్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 
వందల కోట్ల కు సంబంధించిన లావాదేవీలకు సరైన టాక్స్ చెల్లించడం లేదని వచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. అయితే, అక్ర‌మ వ్యాపారాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.