శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (22:27 IST)

జగన్ రెడ్డి గారూ! ఒక్క‌సారి కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రివైపు కన్నెత్తి చూడండి

జగన్ రెడ్డి గారూ! ఒక్క‌సారి కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూడండి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. క‌రోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృద‌య‌విదార‌కంగా ఉంది.

వ‌రండాలోనే శ‌వాలు, నేల‌పైనే పేషెంట్లు.. ఎవ‌రు బ‌తికున్నారో, ఎవరు చ‌నిపోయారో తెలియ‌ని దుస్థితి. మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి వారి ప్రాణాలు కాపాడండి. ప్రతిప‌క్ష‌ నేతల్ని అక్ర‌మ అరెస్టులు చేయించ‌డంపై చేస్తోన్న స‌మీక్ష‌లు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నేల‌పైనే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న‌ ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌టంపై పెట్టండి.

104కి కాల్ చేస్తే 3 గంట‌ల్లో బెడ్డు ఇవ్వాలని మీరంటారు. 104 య‌జ‌మాని మామ‌గారైన‌ విశాఖ ఏ2 వైర‌స్ రెడ్డి గారే స్వ‌యంగా ఫోన్ చేసినా వారెత్త‌రు. వ్యాక్సిన్ కొన‌డానికి డ‌బ్బుల్లేవ‌ని చేతులెత్తేసి, చంద్ర‌బాబు గారు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌ల‌హాల జీత‌గాడు స‌జ్జ‌ల వాగుతున్నారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ వాళ్లే నమ్మలేకపొతున్నారు అంటూ విమర్శించారు.