1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (09:02 IST)

భార్యపై అనుమానం.. అడవికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు కట్టేసి మర్మాంగాలు కోసిన భర్త

కడవరకు కాపాడాల్సిన భర్త.. భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్య తప్పుడు చేస్తుందన్న అనుమానంతో ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెను నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి కాళ్లు చేతులు కట్టేసి.. మర్మాగాలను కోసిపడేశాడు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వీధి నాటకాలు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
గత కొద్ది రోజులుగా భార్య రాధ (35)పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తరచూ చావబాదుతూ వచ్చాడు. నాలుగు రోజుల కిందట గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి కాళ్లూ చేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేసి, కత్తితో మర్మాంగాలు కోసేశాడు. బాధితురాలి పుట్టింటివారు శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.