1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (17:28 IST)

జనసేనకు జెండానే లేదు.. మంత్రి పితాని సత్యనారాయణ

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన ప్రత్యర్థి వైకాపానే అని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయేనని, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు కాబట్టి, ఆయన గురించి ఆలోచించే సమయం తమకు లేదన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణబద్ధంగా పవన్ కల్యాణ్ ఆలోచించడం లేదని అన్నారు.