గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (17:04 IST)

వ్యభిచారం గృహంపై పోలీసుల రైడ్.. ఒకే మంచంపై ముగ్గురు(త్రీసమ్)... ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. స్థానికంగా ఉండే ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందు

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. స్థానికంగా ఉండే ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకుని ఆ ఇంటిపై దాడి చేయగా, ఒకే మంచంపై ముగ్గురు రాసలీలల్లో (త్రీసమ్) మునిగి తేలుతుండటాన్ని చూసిన ఖాకీలు విస్తుపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి చెందిన ఓ 34 యేళ్ల మహిళ నగరంలోని రాంచంద్రాపూర్‌కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివశిస్తోంది. ఈమె రాజమండ్రి, దవళేశ్వరం నుంచి మహిళ (40), విజయవాడలోని సింగినగర్‌కు చెందిన మహిళ(30), నల్గొండ జిల్లా కోదాడకు చెందిన బాలిక (17)లను తన ఇంటికి తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు ఉప్పందించారు. 
 
దీంతో రెండో పట్టణ పోలీసులు గురువారం దాడి చేయగా ఇంట్లో గండ్ర విష్ణువర్ధన్‌, పూన మల్లేశం, జక్కుల నవీన్‌ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ముగ్గురు విటులు, నిర్వాహకురాలు, బాలికతో సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను స్వధార్‌ వసతి గృహానికి తరలించారు.