మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (16:50 IST)

ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా? ఫోటోలు వైరల్

Sand Jaathara
Sand Jaathara
కొత్త ఇసుక విధానం ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన ఇసుక సేకరణ ప్రక్రియను అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకే ఇసుక రవాణాకు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల వాడకాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఇసుక విధానానికి కొత్త సవరణను అమలులోకి తెచ్చింది.
 
ఈ కొత్త మార్పుతో, నామమాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించి ప్రజలు తమ సొంత ట్రాక్టర్లు, బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా రవాణా చేయవచ్చు. 
Sand Jaathara
Sand Jaathara
 
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇసుక సోర్స్ పాయింట్ల నుండి ఫోటోలు వైరల్ కావడం ప్రారంభించడంతో ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా అన్నట్లు వుంది పరిస్థితి. ఈ చిత్రాలలో, రీచ్‌ల నుండి ఇసుకను సేకరించడానికి పదుల లేదా వందల ట్రాక్టర్లు క్యూలో నిలబడటం చూడొచ్చు. కొత్త ఇసుక విధానాన్ని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

Sand
Sand