1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:31 IST)

అమరావతి భూములపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూ ఢిల్లీ: అమరావతి భూముల అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిట్‌, కేబినెట్‌ సబ్‌ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
 
కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రతి వాదులు కోరగా.. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా వేసింది.
 
దమ్మాలపాటి కేసును కూడా అప్పుడే విచారిస్తామన్న సుప్రీంకోర్టు.. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు విచారణను జరపొద్దని చెప్పామని జస్టిస్‌ అశోక్‌భూషణ్ స్పష్టం చేశారు. మార్చి 5న పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలిపారు.